ఢిల్లీ జోరు
చెన్నై: ప్రొ.కబడ్డీ లీగ్లో దబాంగ్ ఢిల్లీ జోరు కొనసాగిస్తోంది. సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో 29-26తో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్కు షాకిచ్చింది. ఈ గెలుపుతో తాజా సీజన్లో 20 పాయింట్లు సాధించిన తొలి జట్టుగా ఢిల్లీ నిలిచింది. ఢిల్లీ జట్టులో అషుమాలిక్ (8), సందీప్ (7) సత్తా చాటారు. రెజా, దీపాన్షు హైఫైవ్తో మెరిసినా జైపూర్కు ఓటమి తప్పలేదు. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 36-28తో యూపీ యోధా్సను చిత్తు చేసింది.
Comments