విశాఖ చేరుకున్న హర్మన్ సేన
విశాఖపట్నం : దక్షిణాఫ్రికాతో ఈనెల తొమ్మిదిన జరిగే మహిళల ప్రపంచ కప్ వన్డే మ్యాచ్లో తలపడే భారత జట్టు సోమవారం నగరానికి చేరుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే శ్రీలంక, పాకిస్థాన్ జట్లపై విజయాలు సాధించి మంచి ఊపుమీదుంది. భారత జట్టుకు విశాఖ విమానాశ్రయంలో ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రతినిధులు స్వాగతం పలికారు. భారత క్రికెటర్లు మంగళవారం సాయంత్రం సాధన చేస్తారు.
Comments