కర్ణాటకలో కులగణన.. స్కూళ్లకు 10 రోజుల సెలవులు
కులగణన సర్వే నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లకు 10 రోజులు సెలవులు ప్రకటించారు. రేపటి నుంచి ఈనెల 18 వరకు మూసివేయనున్నట్లు తెలిపారు. సర్వేలో టీచర్లు పాల్గొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కులగణన ఇవాళే ముగియాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల మరో 10 రోజులు పొడిగించారు. అటు సర్వే చేస్తున్న ముగ్గురు సిబ్బంది మరణించగా రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
Comments