5 ఏళ్లలో బంగారం, వెండి ధరల పెరుగుదల ఇలా
బంగారం, వెండి ధరలు ఈ మధ్యకాలంలో భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. గత ఐదేళ్లలో బంగారంపై 138శాతం, వెండిపై 156శాతం రాబడి వచ్చిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. 2020 అక్టోబర్లో 10గ్రాముల బంగారం ధర రూ.50,690 ఉండగా ఇవాళ రూ.1.2లక్షలకు చేరింది. అలాగే కేజీ వెండి ధర రూ.60,533 నుంచి రూ.1.60లక్షలకు ఎగబాకింది. దీంతోపాటు ప్లాటినంపై 43శాతం, కాపర్పై 69శాతం రిటర్న్ వచ్చినట్టు తెలిపారు.
Comments