రేపటి నుంచి వైద్య సేవలు బంద్
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో రేపటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు తెలిపాయి. ప్రభుత్వం నుంచి రూ.2,700 కోట్లు రావాలని పేర్కొన్నాయి. గత రెండు రోజులుగా ప్రజాప్రతినిధులను కలిశామని వెల్లడించాయి. తమ ఆందోళన కారణంగా సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్లు తెలిపాయి.
Comments